హోమ్

9, ఆగస్టు 2016, మంగళవారం

పసిడి క్రాంతి

ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (26/10/1997) లో ప్రసారమైన కవిత.

భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి. 
"మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?"

ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది.  ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.  
పసిడి క్రాంతి
క్షమాజాలు నరికి నవసమాజాలు నిర్మించుకున్న పాపానికి,
నేడు వనాలన్నీ తాము దహనమౌతూ, మనిషినీ శిక్షిస్తున్నాయి.
ప్రకృతి కాంతని క్షోభ పెట్టినందుకేనేమో,
నేడు ఓజోన్ పొర ఆల్ట్రా వయొలెట్లను వర్షిస్తోంది.
నాడు విస్తరణ కాంక్షతో పరస్పరం చంపుకున్నందుకేనేమో,
నేడు హైటెక్ తుపాకీ లు వాటంతటవే విషాన్ని గ్రక్కుతున్నాయి.
ధనార్జన ఇంధనంతో నడిచే పరిశ్రమలపై క్రమ్మిన,
స్వార్ధమేఘాలు వర్షించి, వికసించిన అవినీతి ప్రసూనాలు
ఘ్రాణించీ,ఘ్రాణించీ రాటుదేలిన,
మసిబారిన మనిషి మనసు మారేదెన్నడో?
వసివాడని పసిడి క్రాంతి విరిసేదెన్నడో?
భావి తరాలు స్వేచ్ఛా సౌహ్రార్ధ్ర వాయువులు పీల్చేదెన్నడో?



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి