హోమ్

23, మే 2019, గురువారం

ఏమో గుర్రం ఎగరావచ్చు - పునః పరిశీలన

2017 ఆగస్ట్ లో రాసిన పోస్టు. నేటి ఫలితాల సందర్భంగా ... ఆ రోజు అనుకున్నట్లే అమ్మ పార్టీ NDA లో చేరింది. బాబు మోదీ విడిపోయారు....చూద్దాం ఇంకేం జరుగుతాయో ఈ రోజు..

రాజకీయ బేతాళం:

"ఇవాళ వెంకయ్యనాయుడు సింహాసనం అధిష్టించాడు తెలుసా?" న్యూస్ పేపర్ లో వఛ్చిన వెంకయ్యనాయుడు ఫుల్ సైజు ఫోటోలు చూపిస్తూ అన్నాను బామ్మతో.

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన రోజు ఆవిడ చాలా సంబర పడిపోయింది.

"ఏంటీ సింహాచలం వెళ్ళాడా? ఎందుకు వెళ్ళడూ, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులూ ఊళ్ళు పట్టుకు తిరగడం మామూలేగా" అందావిడ.

"సింహాచలం కాదే, సింహాసనం ఎక్కాడంటున్నా" అన్నాన్నేను.

"ఓ అదా. తెలుగువాడికి ఈ పదవి వచ్చిందన్న మాటే గానీ, మనకి ఒరిగేదేమీ లేదు రా."

"ఎందుకు లేదూ, పవర్‌ఫుల్ పదవే కదా, తెలుగు రాష్ట్రాలకి రావాల్సినవన్నీ రప్పిస్తాడు లే."

బామ్మకి రాజకీయ జ్ఞానం ఎక్కువే అందుకే ఒప్పుకున్నట్లు కనపడలేదు. ఏదో రహస్యం కనిపెట్టినట్లు గా చెప్పటం మొదలు పెట్టింది.

"అదే రా మోదీ జీ గారి తెలివి. ఇన్నాళ్ళూ మనకీ, కేంద్రానికి మధ్య ఉన్న లింకు ఈ వెంకయ్య నాయుడు గారే, ఆయనే ఏదైనా నిల దీసినా, నిధులు కోసం పోట్లాడినా నూ. ఇప్పుడాయన్ని తీసి, పార్టీలకతీతం గా పని చేయాల్సిన పోస్టు లో వేసేసి, ఆ లింకు తెగ్గొట్టారు. బి జె పీ కి సొంత బలం ఉంది కాబట్టి, చంద్ర బాబు ఆట్టే ఒత్తిడి పెట్టలేడు. పనిలో పని గా, ఆంధ్రా కీ, తెలంగాణాకీ చెరో సీనియర్ గుజరాతీ నీ గవర్నరు గా పంపించి నిఘా పెట్టిస్తాడు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో పార్టీ పట్టు పెంచుకునే ప్రయత్నాలు ఎలాగో ముమ్మరం చేసేసారు. ఇక వచ్చే ఎలక్షన్ల లో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ల సంఖ్యా, ఓట్ పెర్సంటేజీ పెంచుకోవడానికి శత విధాల కృషి చేస్తారు. తెలుగు రాష్ట్రాలకి ఏదైనా మంచి చేయదలచుకుంటే, అది ఎలక్షన్లకి ముందు చేసి, ప్రజల వద్ద ఇంప్రెషను కొట్టేస్తారు."

"ఆ ఇదంతా, వట్టి భ్రమ, వచ్చే మంత్రివర్గ విస్తరణలో దక్షిణాది వారికే ప్రాధాన్యంట" కొట్టి పారేశాన్నేను.

"ఏంటీ దక్షిణా మూర్తి స్తోత్రమా, ఇక మనకి మిగిలిందదే." నవ్వుతూ అంది బామ్మ.

"దక్షిణా మూర్తి కాదే, మంత్రి వర్గ విస్తరణ లో దక్షిణాదికి పెద్ద పీట వేస్తారుట."

"విస్తరణ లో పెద్దపీటా? నితీశ్ కుమారుకి , అమ్మ పార్టీ వాళ్ళకి పోను, మిగిలినవెన్ని? అందులో వచ్చేవెన్ని, పోయే వెన్ని?" బామ్మ భవిష్యత్తు చెప్పేస్తోంది.

"అమ్మ పార్టీ వాళ్ళు కూటమి లో లేరు కదే?" సందేహానుమానం వెలిబుచ్చాను.

"అదెంత పని రా, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన వాళ్ళందరూ, కూటమి లో ఉండే ఇచ్చారా? నితీశ్  చేరలేదూ.ప్రాంతీయ పార్టీల్లో ఎవరికి గెలిచే అవకాశాలుంటే వాళ్ళందర్నీ కూటమిలో చేర్చేసుకోవడం వాళ్ళకి ఓటు తో పెట్టిన విద్య. వచ్చే ఎలక్షన్ల లో బాబు ని దూరం పెట్టి, జగన్ని చేరదీయ వచ్చు, అమ్మ పార్టీని కూటమి లో చేర్చుకోవచ్చు, గెలవడానికి ఏదైనా చెయ్యవచ్చు."

"బాగుంది నీ చిలక జోస్యం, మోదీ, బాబూ విడిపోవడం కల్ల" ఒప్పుకోదలచుకోలేదు నేను.

"98లో అమ్మ ఎక్కడుంది? కూటమిలో లేదూ? గోద్రా తర్వాత బాబు కూటమి నుండి వెళ్లిపోలేదూ? మొన్నటికి మొన్న ఈ నితీశే మోదీ తో తెగతెంపులు చేసుకొని మళ్ళీ కలిసి పోలేదూ? రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ, శత్రువులూ ఉండరని నీకు తెలియదట్రా."ఏమో గుర్రం ఎగరావచ్చు..."

15 కామెంట్‌లు:

  1. What? 2017లోనే మీ బామ్మగారలా అనేసారా?
    వారికి భవి‌ష్యత్తులోకి తొంగి చూడగలిగే శక్తి ఉన్నట్లుందే👋 అసలు టీవీ చర్చల్లో ఇటువంటి వారిని కూర్చోబెట్టాలండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు విన్నకోట నరసింహారావు గారు. ఆ బామ్మా నేనే, నేనూ నేనే. డబల్ పోజు.

      తొలగించండి
    2. అమ్మో. కమల్ హాసనే అనుకున్నా మీరు కూడా విశ్వరూపం చూపించగలరే!

      తొలగించండి
    3. @సూర్య గారు, ఏదో అలా ... కుదిరిపోయిందంతే

      తొలగించండి
  2. ఆంధ్రా కీ, తెలంగాణాకీ చెరో సీనియర్ గుజరాతీ నీ గవర్నరు గా పంపించి నిఘా పెట్టిస్తాడు.
    May be it's true.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మళ్ళీ ఆ అంధేరాప్రదేశ్ కోసం ఒక గవర్నరు అవసరం ఏముందండీ. ఆ ప్రాంతం పాలన అంతా హైదరాబాదు నుండే నడుస్తుంది, మోదీ ఆదేశాలూ కేసీఆర్ సూచనలూ మేరకు. అమరావతి అంతా గ్రఫిక్స్ కదా. అక్కడేముందనీ? ఒకవేళ ఉన్నా అది చుట్టి ఆవల పారేస్తాం కదా!

      తొలగించండి
    2. అంతే అంతే. అమరావతిలో అంతా గ్రాఫిక్సే. ఇప్పటికే ఎమెల్యే క్వార్టర్స్, ఇతర ప్రభుత్వ బిల్డింగ్లకి గ్రాఫిక్స్ పునాదులేసేసి, గ్రాఫిక్స్ అంతస్తులు కట్టేసారు. కొన్ని గ్రాఫిక్స్ కట్టడాలు పూర్తయిపోయాయి కూడా. ఇప్పుడీ గ్రాఫిక్స్ బిల్డింగ్లు తరలించటం కష్టంకాబట్టి కట్టకుండా మిగిల్చిన హైకోర్టు, సచివాలయం వరకు దోనకొండలో కట్టుకోవచ్చు. అప్పుడు అవి మాత్రమే నిజం బిల్డింగ్స్ అవుతాయి అన్నట్టు.

      తొలగించండి
  3. చూద్దామండీ ఏమౌతుందో! ఇది అప్పటి నా ఊహాగానాల్లో ఒకటి.

    రిప్లయితొలగించండి
  4. పాచిపట్టకముందే వండింది తినేయ్యాలి. విభజన జరిగిన మొదట్లోనే రావలసినవి దక్కించుకోవాలి. కాలం గడిచిపోయాక మనకి ఏదన్నా ఇవ్వాలన్నా అడ్డుపడేవారు ఎక్కువ. ఇక మనం ప్రత్యేక హోదా గురించి మర్చిపోవచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే, మెజార్టీ కోసం దేహి అనే అగత్యం లేదు కనుక, ఇహ హోదా ఇవ్వాల్సిన అవసరం కేంద్రానికి లేదు.

      తొలగించండి
  5. ఇప్పుడు దేశంలో ఎవరికీ పట్టని రాష్టాల్లో ఆంద్రప్రదేశ్ ముందు ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పుడేంటి సార్? రాష్ట్ర విభజన జరిగినపుడే మనం అరుణాచాలప్రదేశ్ మణిపూర్ లాంటి రాష్ట్రాల సరసన చేరిపోయాం. వాళ్ళకి కనీసం ప్రత్యేక హోదా ఉంది మనకి అది కూడా లేదు.

      తొలగించండి
    2. ఆ అంధేరాప్రదేశ్ ప్రజలకే తమ రాష్ట్రం బాగోగుల గురించి పెద్దగా పట్టింపు లేనప్పుడు, ఇంక వేరే ఎవరు మాత్రం ఆ రాష్ట్రం గురించి ఎందుకు పట్టించుకుంటారు. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ అని పురాణోక్తి. తెలుగులో చెప్పమంటారా? ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎన్నడైనా తప్పదన్నా!

      తొలగించండి